ఇంఫాల్ : మయన్మార్ శరణార్థుల విషయంలో మణిపూర్ ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది. వివిధ సంస్థల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా ఉపసంహరించుకున్నది.
పొరుగు దేశం నుంచి భారతదేశంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న మయన్మార్ శరణార్థులను ‘మర్యాదగా తిప్పికొట్టండి’ అ నాలుగు రోజుల క్రితం మణిపూర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మానవతా థృక్పధాన్ని విడనాడి ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని పలు జాతీయ మానవ హక్కుల సంస్థలు దుమ్మెత్తిపోయడంతో మునుపటి ఉత్తర్వును మణిపూర్ ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.
చండెల్, తెంగ్నౌపాల్, ఉఖ్రుల్, చురాచంద్పూర్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు మణిపూర్ హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి హెచ్ జ్ఞాన్ ప్రకాష్ తాజా లేఖను విడుదల చేశారు. మార్చి 26 న జారీ చేసిన లేఖను విస్మరించాలని నాలుగు జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఆదేశిస్తూ తాజా లేఖ జారీ చేశారని జ్ఞాన్ ప్రకాష్ ఇంఫాల్లో మీడియాకు చెప్పారు.
మార్చి 26 న జారీ చేసిన ఉత్తర్వు తప్పుగా ఇచ్చారని తాజా లేఖలో ప్రభుత్వం పేర్కొన్నది. మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంతో సరిహద్దుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మయన్మార్ పౌరులకు అన్ని రకాల సహాయం అందిస్తున్నదని అధికారులు తెలిపారు.
సైనిక తిరుగుబాటు అనంతరం మయన్మార్ నుంచి పారిపోయి గాయపడిన పలువురు మయన్మార్ శరణార్థులను చికిత్స కోసం మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు తీసుకురావడంతో పాటు అవసరమైన అన్ని మానవతా చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని లేఖలో పేర్కొన్నది.
గతంలో జారీ చేసిన ఉత్తర్వుల పట్ల అపార్థాన్ని నివారించడానికి ఈ లేఖ జారీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. మయన్మార్ శరణార్థులకు ఆహారం ఇవ్వడం, ఆశ్రయం కల్పించడానికి ఎటువంటి శిబిరం ఉండకూడదని, పౌర సమాజాలు కూడా ఇవే నిర్ణయాలను అమలు చేయాలని ఈ నెల 26 న మణిపూర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మణిపూర్ ప్రభుత్వం అమానవీయ ప్రవర్తనపై రాష్ట్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
ఇలాఉండగా, మణిపూర్ ప్రభుత్వ చర్యలు మిజోరాం రాష్ట్రంలో విరుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ సరిహద్దు ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించిన మయన్మార్ శరణార్థులను తిప్పికొట్టడానికి ముఖ్యమంత్రి జొరామ్తంగా నిరాకరించారు.
దాదాపు 1,000 మంది మయన్మార్ శరణార్థులు మిజోరంలోకి ప్రవేశించి ప్రస్తుతం రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ధర్నాలో కూర్చున్న వారిపైకి దూసుకొచ్చిన కారు.. ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు
బ్రెజిల్లో వ్యాక్సిన్ కొరత.. విదేశాంగ మంత్రి రాజీనామా?
బొగ్గు అక్రమ రవాణా కేసులో సీబీఐ ఎదుట హాజరైన కింగ్పిన్ లాలా
బంగ్లాదేశ్లో మోదీ పర్యటన.. షేక్ హసీనా మెడపై కత్తి
రాజస్థాన్ ఆవిర్భావ దినం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..