న్యూఢిల్లీ : ఏప్రిల్ 6న బీజేపీ 41వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించనున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నిర్వహించనున్న సమావేశంలో మాట్లాడనున్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ జరుగుతున్న 6వ తేదీనే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రావడం యాదృశ్చికం.
పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బూతు స్థాయి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ చరిత్ర, మూల్యాంకనం, ఆలోచన విధానాలు, కట్టుబాట్లు తదితర అంశాలపై రాష్ట్ర, జిల్లా స్థాయిలో వెబినార్ల ద్వారా చర్చించనున్నారు.
1951లో శ్యామప్రసాద్ ముఖర్జీ భారతీయ జన సంఘ్ను స్థాపించారు. 1977లో ఇది పలు పార్టీలతో కలిసి జనతా పార్టీగా మారింది.
1980లో జనతా పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తమ సభ్యులకు ద్వంద్వ సభ్యత్వాన్ని (పార్టీ, ఆర్ఎస్ఎస్ సభ్యత్వాలు) రద్దు చేసింది.
దీంతో మాజీ జన సంఘ్ సభ్యులు ఆ పార్టీని వీడి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ విధంగా ఏప్రిల్ 6, 1980న బీజేపీ ఆవిర్భవించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి