2021-22 ఆర్థిక సంవత్సరానికి రూపకల్పన
కమిషనర్ ఆమోదానికి పంపిన ఆలయ అధికారులు
వేములవాడ, మార్చి 29: వేములవాడ రాజన్న ఆలయ వార్షిక బడ్జెట్ను రూ.191కోట్ల అంచనాలతో రూపొందించి రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆమోదానికి పంపినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు. 2021-22ఆర్థిక సంవత్సరానికి గా నూ ఆదాయం రూ.191కోట్లు, వ్యయం రూ.189కోట్ల అంచనాలతో బడ్జెట్ను రూపొందించామన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 78 రోజలు కరోనా నేపథ్యంలో ఆలయాన్ని మూసివేయగా ఫిబ్రవరి వరకు రూ.40 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర నేపథ్యంలో స్వామివారికి అధికంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. 2019-20వ ఆర్థిక సంవత్సరంలో సమక్క-సారలమ్మ మేడారం జాతర సందర్భంగా స్వామివారికి రూ.85 కోట్ల ఆదాయం సమకూరగా ఈ యేడాది కూడా సమక్క జాతరను దృ ష్టిలో పెట్టుకొని ఈ వార్షిక బడ్జెట్ను రూపొందించామన్నారు. ఇక స్వామివారికి సంబంధించిన టెండర్లు, అర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాలు, భక్తులు సమర్పించే హుండీ కానుకలతో కలిపి వచ్చే ఆదాయాన్ని అంచనా వేస్తూ బడ్జెట్ను రూపొందించామన్నారు. ఇక 2021-22 వార్షిక బడ్జెట్ను రూపొందించగా ఇందులో ఆదాయం రూ. 191కోట్లు కాగా, వ్యయం రూ.189కోట్లుగా అంచనాలతో కూడిన బడ్జెట్ ప్రతిపాదన చేశారు.
ఇందులో ఆదాయంగా తిరుగు పెట్టుబడులు రూ.54 కోట్లు, హుండీ కానుకల ద్వారా రూ.25 కోట్లు, కోడెమొక్కుల ద్వారా రూ.20 కోట్లు, ప్రసాదాలు రూ.15కోట్లు, లీజుల ద్వారా రూ.15కోట్లు, స్వామివారికి వడ్డీల ద్వారా రూ.8కోట్లు, అన్నదానం రూ. 7కోట్లు, ధర్మశాలల ద్వారా రూ.3 కోట్లు, అనుబంధ ఆలయాలైన మామిడిపల్లి సీతారామచంద్రస్వామి, నాంపల్లి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాల ద్వారా రూ. 3కోట్లతో అంచనాలు వేశా రు. ఇక వ్యయంగా తిరిగి పెట్టుబడులు రూ.62 కోట్లు, వేతనాలు రూ.18కోట్లు, గోదాం సరుకుల కోసం రూ. 20కోట్లు, ప్రసాదాలకు రూ.15కోట్లు, పెన్షన్ నిధి రూ.7కోట్లు, నూతన పెట్టుబడులు రూ.5కోట్లు, అనుబంధ ఆలయాలకు రూ.4కోట్లు, నిర్వహణ పనుల కోసం రూ.3కోట్ల అంచనాలతో కూడిన వ్యయాన్ని రూపొందించారు. ఇక అంచ నా బడ్జెట్ను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి కోరుతూ నివేదికలను అందజేశారు.
ఇవి కూడా చదవండి
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
ప్రభుదేవాతో లైగర్ టీం.. వైరల్గా మారిన పిక్