గజ్వేల్ అర్బన్, ఏప్రిల్ 9: గజ్వేల్ జిల్లా దవాఖాన నిర్వహణ బాగుందని కాయకల్ప కేంద్ర బృందం కితాబు ఇచ్చింది. ముఖ్య పరిశీలకుడు డాక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో కాయకల్ప కేంద్రం బృందం శుక్రవారం గజ్వేల్ జిల్లా దవాఖానను సందర్శించింది. వివిధ విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించింది. దవాఖానకు వచ్చే రోగులను కుటుంబ సభ్యులుగా ప్రేమతో కూడిన వైద్యాన్ని అందించాలని సూచించింది. ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలించి దవాఖానల నిర్వహణ, వైద్య సేవలు, వివిధ విభాగాల్లో పనితీరును నమోదు చేసుకున్నట్లు తెలిపారు. గజ్వేల్ దవాఖాన నిర్వహణ, వైద్య సేవలు చాలా బాగున్నాయని కొనియాడారు. వైద్యసేవ దేవుడిచ్చిన వరమని, దానిని సక్రమంగా నిర్వహించాలన్నారు. బృందంలో డాక్టర్ కే రాముడు, స్టెల్లా ఉన్నారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్, గడా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్, ఆర్ఎంవో డాక్టర్ రాము, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
రాష్ట్ర ప్రగతికి జగన్ చేసిందేమిటి.. నిలదీసిన బాబు
కొత్తగా 4 కొవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటు
జూమ్ క్లాస్ నుంచి స్టూడెంట్ డిటెన్షన్