ఇప్పటికే రెండు డోసుల టీకా వేసుకున్నా సోకిన వైరస్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. మన్మోహన్లో కరోనా లక్షణాలు తీవ్రంగా లేవని, ముందుజాగ్రత్త కోసమే దవాఖానలో చేరారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జ్వరంగా ఉండటంతో పరీక్షలు చేయగా ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మన్మోహన్సింగ్ ఇప్పటికే కరోనా టీకా రెండు డోసులను తీసుకొన్నారు. చివరి డోసు ఈ నెల 3న వేసుకొన్నారు.