జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కలశస్థాపన, విష్వక్సేన వాసుదేవ పుణ్యాహవాచనం, బ్రహ్మకలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం 7గంటలకు శ్రీలక్ష్మీనర్సింహ స్వామి (యోగా, ఉగ్ర), శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను సేవలపై ఉంచి వరాహతీర్థం, పుట్టబంగారం కోసం తీసుకెళ్లారు. చింతామణి చెరువు కట్ట వద్ద పూజలు చేసి పుట్టబంగారం తీసుకువచ్చారు. వేడుకల్లో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై లక్ష్మీనర్సింహస్వామి వార్ల (ఉగ్ర, యోగ) కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించనున్నారు.