భారతదేశం 12 వ ప్రధానిగా ఇంద్ర కుమార్ గుజ్రాల్ నియమితులయ్యారు. హెచ్డీ దేవేగౌడ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంకీర్ణ పార్టీలు మళ్లీ సమావేశమయ్యాయి. ఇందర్ కుమార్ గుజ్రాల్ను ప్రధానిగా చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశం జరుగుతున్న సమయంలో గుజ్రాల్ తన ఇంట్లో నిద్రిస్తున్నారు. సంకీర్ణ నాయకులు అతని ఇంటికి చేరుకుని గుజ్రాల్ను మేల్కొలిపి.. వార్తను ఆయన చెవిలో వేశారు. దాంతో ఆయన 1997 ఏప్రిల్ నెలలో సరిగ్గి ఇదేరోజున భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇంద్ర కుమార్ గుజ్రాల్ 1919 డిసెంబర్ 4 న పాకిస్తాన్ పంజాబ్లోని జీలంలో జన్మించారు. గుజ్రాల్ తల్లిదండ్రులు స్వాతంత్ర్య సమరయోధులు. గుజ్రాల్ చిన్నప్పటి నుంచీ చదువులో ముందున్నారు. ఆయన ఎంఏ, పీహెచ్డీ, డీలిట్ పొందారు. 2012 నవంబర్ 30 న, ఇంద్ర కుమార్ గుజ్రాల్ సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు.
వీపీ సింగ్, చంద్రశేఖర్ పదవీకాలంలో గుజ్రాల్ విదేశాంగ మంత్రిగా విశేష సేవలందించారు. గుజ్రాల్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు.. ఇరాక్-కువైట్ మధ్య గల్ఫ్ యుద్ధం చెలరేగింది. ఈ సమయంలో గల్ఫ్లో చిక్కుకున్న 1 లక్ష 70 వేల మంది భారతీయులను విమానాల ద్వారా సురక్షితంగా తిరిగి దేశానికి తీసుకురాగలిగారు. ఇది ఇప్పటివరకు చేసిన అతిపెద్ద ఆపరేషన్గా పరిగణిస్తున్నారు.
ఎమర్జెన్సీ విధించిన సమయంలో సమాచార, ప్రసారాలశాఖ మంత్రిగా ఐకే గుజ్రాల్ ఉన్నారు. ఆలిండియా రేడియోలో చదివిన వార్తలను సెన్సార్ చేయమని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ గుజ్రాల్ను ఆదేశించారు. అయితే, గుజ్రాల్ ఈ ఉత్తర్వులను అంగీకరించేందుకు నిరాకరించారు. దీని తరువాత ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. మరుసటి రోజే గుజ్రాల్ను సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ నుంచి తొలగించారు.
కాపీ లేదా కాలిక్యులేటర్ లేకుండా 13 అంకెలతో 2 సంఖ్యలను కేవలం 28 సెకన్లలోనే గుణించారు సూపర్ కంప్యూటర్గా పేరుగాంచిన శకుంతలాదేవి. ఈ కారణంగా ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది.
1929 నవంబర్ 4 న కన్నడ కుటుంబంలో జన్మించిన శకుంతలాదేవి తండ్రి సర్కస్లో పని చేసేవారు. శకుంతల ప్రత్యేకమైన ప్రతిభను ఆమె తండ్రి మూడేండ్ల వయసులో గుర్తించారు. ఆమె ఐదేండ్ల వయసులో గణిత ప్రశ్నలను తేలికగా పరిష్కరించడం ప్రారంభించింది. 1977 లో డల్లాస్ విశ్వవిద్యాలయంలో 201 యొక్క 23 వ మూలాన్ని లెక్కించడం ద్వారా శకుంతలాదేవి గొప్పతనం ప్రపంచానికి తెలియవచ్చింది. ఇంత కష్టమైన ప్రశ్నను కేవలం 50 సెకండ్లలో పరిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
శకుంతలాదేవి తన 83 వ ఏట 2013 ఏప్రిల్ 21 న బెంగళూరులో మరణించారు. 2020 జూలై నెలలో ఆమె బయోపిక్ ‘శకుంతల దేవి’ విడుదలైంది. ఈ సినిమాలో విద్యాబాలన్ నటించారు.
2008: భారత, బ్రిటిష్ నావికాదళాల మధ్య మూడవ ఉమ్మడి విన్యాసాలు గోవా సమీపంలోని కొంకణ్లో ప్రారంభం
1996: పారాచూట్ ద్వారా ఉత్తర ధ్రువంలోకి అడుగుపెట్టిన భారత వైమానిక దళానికి చెందిన సంజయ్ థాపర్
1987: శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబు పేలుడులో 100 మందికి పైగా దుర్మరణం
1977: బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా మేజర్ జనరల్ జియా ఉర్ రహ్మాన్ నియామకం
1938 : ‘సారే జహాసె అచ్చా హిందూస్తా హమారా’ గేయ రచయిత మహమ్మద్ ఇక్బాల్ మరణం
1926: క్వీన్ ఎలిజబెత్ II జననం
1924: అర్జున అవార్డు అందుకున్న తొలి షూటర్ కర్ణి సింగ్ జననం
1910: కాంగ్రెస్ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి సదాశివ్ త్రిపాఠి జననం
1891: రిజర్వ్ బ్యాంక్ మొదటి డిప్యూటీ గవర్నర్ జేమ్స్ బ్రాడ్ టేలర్ జననం
1526: మొఘల్ పాలకుడు బాబర్-ఇబ్రహీం లోడి మధ్య మొదటి పానిపట్ యుద్ధం
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
గర్భంతో ఉన్నా.. మండుటెండ, కరోనాను లెక్కచేయకుండా విధుల్లో డీఎస్పీ.. వీడియో వైరల్
వీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలన విషయాలు
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..