లక్నో: ఉత్తరప్రదేశ్లో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధ్యక్షతన వర్చువల్ పద్ధతిలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కర్ఫ్యూ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే మే 17 వరకు కర్ఫ్యూ విధించగా ఆ గడువు ముగియ వస్తుండటంతో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించాలని నిర్ణయించారు.
మే 24న ఉదయం 7 గంటల వరకు యూపీలో కర్ఫ్యూ కొనసాగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. ఇప్పటికే అమల్లో ఉన్న కర్ఫ్యూ సత్ఫలితాలను ఇవ్వడంతో మరికొన్ని రోజులు కర్ఫ్యూను పొడిగిస్తే మంచి ఫలితం ఉంటుందన్న ఉద్దేశంలతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.