భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో కరోనా కర్ఫ్యూను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
తొలుత ఏప్రిల్ 12 నుంచి 19 వరకు కర్ఫ్యూ విధించారు. ఆ తరువాత 26 వరకు అనంతరం మే 2 వరకు పొడిగించారు.
ఇవాళ సాయంత్రం 6 గంటలకు కర్ఫ్యూ ముగుస్తుండటంతో పొడిగిస్తూ ఆ జిల్లా కలెక్టర్ అవినాశ్ లవానియా ఉత్తర్వులు జారీ చేశారు.
నిత్యావసర సేవలు, అత్యవసర ప్రయాణాలకు మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆదివారం వరకు భోపాల్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91,456కు చేరింది. 742 మంది ప్రాణాలు కోల్పోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.