వచ్చేనెల 31 వరకు అమల్లో ఉంటాయన్న కేంద్రం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కరోనా నియంత్రణ చర్యలను వచ్చేనెల 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ‘దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే కొన్ని రాష్ర్టాల్లో వైరస్ వ్యాప్తి కొంత ఎక్కువగా ఉన్నది. వచ్చేనెలలో పండుగలు ఉన్న నేపథ్యంలో జనాలు గుమికూడటం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగొచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కరోనా నియంత్రణ చర్యలను వచ్చేనెల 31 వరకు పొడిగిస్తున్నాం’ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పండుగలను జరుపుకొనేలా చూడాలని ఆ లేఖలో కోరారు.