చిక్కడపల్లి, మార్చి 26: ఆసమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సేవలను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో ఆసమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రజల అవసరాలను గుర్తించి, వారి అవసరాలు తీర్చే విధంగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించాలని సూచించారు. ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ విన్నకోట మాట్లాడుతూ, మహిళ అభ్యన్నతి కోసం ఆసమ్ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందన్నారు. సమావేశంలో వీఆర్ఈఏపీ సంస్థ వ్యవస్థాపకుడు యుగంధర్ దొడ్డ, ప్రసన్న కుమార్, ఎన్నడి బాబు, ప్రవీణ్ మామిడాల తదితరులు పాల్గొన్నారు.