జీడిమెట్ల, మార్చి 30 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సైబర్ క్రైం హెల్ప్ డెస్క్కు మంచి స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకు సైబర్ క్రైంకు సంబంధించిన నేరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులే దర్యాప్తు చేస్తుండే వారు ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు అధికమవుతుండడంతో ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ నెల 21వ తేదీ నుంచి సైబర్ క్రైం హెల్ప్ డెస్క్ను జీడిమెట్ల పోలీస్స్టేషన్లో ప్రారంభించారు. దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆన్లైన్, ఫేస్బుక్, ఇతర డాట్ కామ్లకు సంబంధించిన మోసాలు, నేరాలకు సంబంధించి ఫిర్యాదులను ఇక్కడే స్వీకరిస్తారు. ఆన్లైన్ బాధితులు ఇక్కడే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు.
ఆన్లైన్లో జరుగుతున్న మోసాలు, నేరాలను బాధితులు వాస్తవాలను ఫిర్యాదుల్లో పేర్కొంటే ఆ కేసులను సత్వరమే పరిష్కరించే వీలు కలుగుతుంది. నిర్భయంగా బాధితులు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి. అవసరంలేని ఆన్లైన్ సైట్ల జోలికి వెళ్లవద్దు. సైబర్ క్రైం మోసాలను తెలుసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీకు సంబంధించిన ఓటీపీలను ఇతరులకు సెండ్ చేయవద్దు. అపరిచితుల మాటలు నమ్మి ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులను పోగొట్టుకోవద్దు. – కె.బాలరాజు, ఎస్హెచ్ఓ జీడిమెట్ల పోలీస్స్టేషన్