24 గంటల్లో 2,17,353 మందికి వైరస్
మూడు రాష్ర్టాల్లోనే లక్షకు పైగా కేసులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో కరోనా మహోగ్రరూపం కొనసాగుతున్నది. కేసుల సంఖ్య రోజూ కొత్త గరిష్ఠాన్ని చేరుకుంటున్నది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,17,353 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇదే అత్యధికం. దీంతో కేసుల సంఖ్య 1,42,91,917కు చేరింది. వైరస్తో తాజాగా 1,185 మంది మరణించారు. మృతుల సంఖ్య 1,74,308కి పెరిగింది. 15,69,743 మంది ప్రస్తుతం దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 1,25,47,866 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. దేశంలోని మూడు రాష్ర్టాల్లోనే ఒక్కరోజులో లక్షకు పైగా కేసులు నమోదవ్వడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 61,695, ఉత్తరప్రదేశ్లో 22,339, ఢిల్లీలో 16,699 కేసులు నమోదయ్యాయి.