‘రామప్ప’పనులు పూర్తిచేయాలి
కేంద్రాన్ని కోరిన పోచంపల్లి
ఎంపీలతో కలిసి కేంద్రమంత్రికి వినతి
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కాకతీయుల వైభవానికి చిహ్నంగా నిలిచే వేయిస్తంభాల గుడి పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తిచేయాలని టీఆర్ఎస్ ఎంపీలు సంతోష్కుమార్, బండా ప్రకాష్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఎమ్మెల్సీ పోచంపల్లి కేం ద్రపర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్కు వినతిపత్రం అందజేశారు. రామప్ప దేవాలయాల్లో చేపట్టిన సమగ్రాభివృద్ధి, పునరుద్ధరణ పనులను కూడా సకాలంలో పూర్తిచేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కాకతీయులు రాజధాని ఓరుగల్లులో కట్టించిన వేయి స్తంభాల గుడినాటి శిల్పకళా సంపదకు నిదర్శనంగా నిలుస్తున్నదని తెలిపారు.
ఆలయంలో నక్షత్ర ఆకారంలో ఉండే వాస్తుశిల్పం అద్భుతమైన హస్తకళా నైపుణ్యానికి సాక్ష్యమని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ దేవాలయాల పునరుద్ధరణకు కార్పొరేట్ సోష ల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నిధులు విరాళంగా ఇవ్వవచ్చని కేంద్రమంత్రి తెలి పారని ఎంపీలు పేర్కొన్నారు.‘కాకతీయరాజు రుద్రదేవుడి ఆదేశాల మేరకు క్రీ.శ 1175-1324 మధ్య వేయిస్తంభాల ఆలయం నిర్మించారు. ఈ ఆలయాన్ని విష్ణు, శివుడు, సూర్య తదితర హిందూ దేవతలకు అంకితం చేయబడినదిగా చెపుతారు. శాండ్ బాక్స్ పద్దతిని ఉపయోగించి 1000స్తంభాలతో దీని నిర్మా ణం చేపట్టారు. 800 ఏండ్లకుపైగా ఆలయం చెక్కు చెదరకుండా ఉన్నది. తర్వాత ఒకట్రెండు స్తంభాలు ఒరిగాయన్న కారణంగా ఆ లయానికి దక్షిణాన ఉన్న ‘నాట్య మండపం’ పునర్నిర్మాణం కోసం 2005లో పురావస్తుశాఖ స్తంభాలను తొలగించింది. 18 నెలల్లో పునరుద్ధరించాలని అనుకున్నా.. దశాబ్దం దాటినా పూర్తికాలేదు’ అని తెలిపారు.