ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లను మరోమారు కరోనా వణికిస్తున్నది. దేశవ్యాప్తంగా రెండో వేవ్ కరోనా మహమ్మారి విజ్రుంభిస్తుండటంతో సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లలో ప్రారంభంలోనే నెగెటివ్గా ట్రేడింగ్ మొదలైంది. సమయం గడుస్తున్నా కొద్దీ స్క్రిప్టులు పాతాళానికి పడిపోయాయి. ఉదయం సెన్సెక్స్ 50,020 వద్ద, నిఫ్టీ 14,837 వద్ద నెగెటివ్ ట్రేడింగ్ మొదలు పెట్టాయి.
సోమవారం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. వైరస్ వెలుగులోకి వచ్చాక ఎన్నడూ లేనంతగా దేశీయంగా రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో అత్యధిక కేసుల నమోదులో అగ్రరాజ్యం అమెరికా తొలిస్థానంలో ఉంది.
తాజాగా మనదేశం రెండో స్థానానికి చేరిందన్న వార్తలు అప్పటికే నష్టాల్లో ఉన్న సూచీలను మరింత కిందకు దిగజార్చాయి. ఓ దశలో సెన్సెక్స్ 1391 పాయింట్లు కుంగి 48,638 వద్ద కనిష్ట స్థాయికి పతనం కాగా, ఎన్ఎస్టీ సూచీ నిఫ్టీ సైతం 388 పాయింట్లు పడిపోయి 14,479కి చేరింది.
మొత్తంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ మొదలైన తొలి రెండు గంటల్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 4 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఉదయం 11:20 గంటలకు సెన్సెక్స్ 1307 పాయింట్ల నష్టంతో 48,722 వద్ద.. నిఫ్టీ 371 పాయింట్లు దిగజారి 14,496 వద్ద ట్రేడయింది.
ఒక రకంగా చెప్పాలంటే రాణించిన ఐటీ షేర్లు నష్టాల్ని కట్టడి చేశాయనే చెప్పొచ్చు. బ్యాంకింగ్ రంగ షేర్లు ఏకంగా నాలుగు శాతానికి పైగా నష్టపోయాయి. చివరకు సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 870 పాయింట్ల నష్టంతో 49159.32 పాయింట్ల వద్ద, నిఫ్టీ 229 పాయింట్ల పతనంతో 14637.80 పాయింట్ల వద్ద స్థిరపడింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో