న్యూఢిల్లీ, ఆగస్టు 12: కనుగుడ్డు ముందు భాగాన్ని కప్పి ఉంచే పారదర్శకమైన పొర కార్నియా ఇంప్లాంట్లో పంది చర్మాన్ని వినియోగించి భారత పరిశోధకులు విజయవంతమయ్యారు. కార్నియాలో సమస్యతో కంటిచూపునకు దూరమైన భారత్, ఇరాన్కు చెందిన 20 మంది రోగులకు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందించారు.
పంది చర్మాన్ని వినియోగించి తయారుచేసిన కార్నియాను ఇంప్లాంట్ చేశారు. దీంతో పేషెంట్లకు కంటిచూపు తిరిగొచ్చినట్టు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 1.27 కోట్ల మంది కార్నియా సమస్యలతో సతమతమవుతున్నారని, అయితే దాతల నుంచి అవసరమైన మోతాదులో కార్నియాలు లభించకపోవడంతో ఎక్కువమంది కంటిచూపునకు దూరమవుతున్నట్టు తెలిపారు. తాజా చికిత్సతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయిందన్నారు.