న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్తో అల్లాడిపోతున్న భారత్కు తమ మద్దతు కొనసాగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. కరోనాపై పోరుకు అవసరమైన మందులను పంపిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ పశ్చిమాసియా రీజినల్ డైరెక్టర్ డా. పూనమ్ ఖేత్రపాల్ సింగ్ అన్నారు. ఇందులో భాగంగా 170 మెట్రిక్ టన్నుల అవసరమైన వైద్య సామాగ్రిని అందిస్తున్నామని చెప్పారు. ఇందులో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, టెస్టింగ్ కిట్లు, హాస్పిటల్ బెడ్లు, పీపీఈ కిట్లు, సమీప దవాఖానల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. క్లిష్టమైన అంతరాలను పూడ్చడానికి ఇవి సహాయపడతాయని భావిస్తున్నామని తెలిపారు.