శ్రీనగర్, మార్చి 25: జమ్ము కశ్మీర్లో మిలిటెంట్ల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్సై, కానిస్టేబుల్ మరణించారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్ శివార్లలో లావాపొర ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై మిలిటెంట్లు గురువారం కాల్పులు జరిపారు. ఎస్సై మంగా రాందేవ్ను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ అశోక్ కుమార్… మిలిటరీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గాయపడిన కానిస్టేబుళ్లు నజీం అలీ, జగన్నాథ్కు చికిత్స అందిస్తున్నారు.