భోపాల్, మే 13: ఆమె పేరు ప్రఫుల్లిత్ పీటర్. వృత్తి నర్సు. కరోనా రోగులకు సేవలందిస్తుండగా ఆమెకూ వైరస్ సోకింది. పీటర్ గురించి తెలిసినవారు ఆమె కరోనాతో పోరాడలేదనుకుని బెంగపడ్డారు. ఎందుకంటే అందరిలా ఆమెకు రెండు ఊపిరితిత్తులు లేవు.ఉన్నది ఒకటే ఊపిరితిత్తి. అయినా ఆమె మనోధైర్యం కోల్పోలేదు. శ్వాసకోశాలను దెబ్బతీసే కరోనాపై యోగా, ప్రాణామాయం సాధనాలుగా ఆమె పోరాడి గెలిచారు. మధ్యప్రదేశ్కు చెందిన 39 ఏండ్ల ప్రఫుల్లిత్ బాల్యంలో ఓ ప్రమాదానికి గురయ్యారు. వైద్యులు అప్పుడు ఆమె ఒక ఊపిరితిత్తిని తొలగించారు. అయితే ఆ విషయం ఆమెకు 2014లో ఓసారి ఛాతీ ఎక్స్రే తీయించుకునే వరకు తెలియదు. నర్సు వృత్తిని చేపట్టిన ఆమె ప్రస్తుతం టీక్మగఢ్ ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్నారు. వైరస్ సోకినా అధైర్యపడకుండా పోరాడి గెలిచారు.