చిట్యాల, జూలై 12 : పరిసరాలను ప్రతిఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధులు రాకుండా చూసుకోవాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి అన్నారు. సోమవారం 12వ వార్డులో పిచ్చి మొక్కలను తొలగించి, మురుగు కాల్వలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడుతూ వార్డులోని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్ రెముడాల లింగస్వామి, సింగిల్విండో వైస్ చైర్మన్ మెండె సైదులు, గంట శ్రీనివాస్రెడ్డి, జిట్ట చంద్రకాంత్, పబ్బతి సత్యనారాయణ, రెముడాల ఆనంద్, వీరమళ్ల లింగయ్య పాల్గొన్నారు.
ప్రతి మొక్కనూ సంరక్షించాలి: సీడీపీఓ నిర్మల
నీలగిరి : సీఎం కేసీఆర్ హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. సోమవారం హరితహారంలో భాగంగా రామగిరి అంగన్వాడీ కేంద్రంలో కౌన్సిలర్ యామ కవితాదయాకర్తో కలిసి మొక్కలు నాటి, ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా నర్సరీల్లో లక్షల మొక్కలను పెంచుతున్నదని అన్నారు. హరితహారంలో యువత, విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చెట్లు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్ మంజుల, అంగన్వాడీ టీచర్లు శ్రీలక్ష్మి, జయలక్ష్మి, యాదమ్మ, వినోద, మనీషా, సరోజ, రాజేశ్వరి, ఆయాలు భానుచంద్ర, పుష్ప పాల్గొన్నారు.
మొక్కలను పరిశీలించిన ఎంపీడీఓ
నల్లగొండ రూరల్ : పల్లె ప్రగతిలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి సూచించారు. మండలంలోని జి.చెన్నారం గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కలకు సపోర్టుగా కర్రలు పాతి ఎప్పటికప్పుడు పాదులు తీయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, పంచాయతీ కార్మికులు ఉన్నారు.
కాల్వలను శుభ్రం చేయించిన సర్పంచులు
కనగల్ : పల్లె శుభ్రతే పల్లెప్రగతి లక్ష్యమని చర్లగౌరారం సర్పంచ్ చింతల యాదగిరిగౌడ్ అన్నారు. గ్రామంలో మురుగు కాల్వలను శుభ్రం చేయించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మునుగోడు : మండలంలోని రావిగూడేన్ని వందశాతం పారిశుధ్య గ్రామంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుర్రం సత్యం అన్నారు. గ్రామంలో కల్వర్టు వద్ద మురుగు కాల్వలను జేసీబీతో శుభ్రం చేయించారు. సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. గుర్రం వెంకటయ్య, యాదయ్య, సత్తయ్య పాల్గొన్నారు.
నీటిపారుదల శాఖ కార్యాలయంలో హరితహారం
రామగిరి : నల్లగొండలోని గంధంవారిగూడెంలో ఉన్న ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో హరితహారం నిర్వహించారు. చీఫ్ ఇంజినీర్ శ్రీకాంత్రావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో పర్యవేక్షణ ఇంజినీర్ అజయ్కుమార్, డీఎస్ఈ జీఎన్ వెంకటేశ్, డీసీఈ ప్రభుకళ్యాణ్, ఈఈ బుచ్చిరెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ రాజరత్నం, సిబ్బంది పాల్గొన్నారు.