న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా 15 రోజుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. నవంబర్ 14 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా భారీగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించనున్నది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు పాద యాత్రలు కూడా చేపడతారని తెలిపారు. కాగా, ఇంధన ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం అత్యాశ కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం విమర్శించారు.
మరోవైపు వరుసగా ఐదో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 0.35 పైసలు మేర పెరిగాయి. దీంతో ఆదివారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.107.59కు, ముంబైలో రూ.113.12కు చేరింది.