లండన్ : రాష్ట్రంలో ఏప్రిల్ 30న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్ తో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఏడేండ్లుగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఇదిలాగే కొనసాగాలంటే ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు.
కరోనా సమయంలో, వరదలు సంభవించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వరంగల్ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుందని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వరంగల్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలు విని మోసపోవద్దు అని సూచించారు.
సీఎం కేసీఆర్ సహా వారి కుటుంబ సభ్యులు కేటీఆర్, సంతోష్ కరోనా బారిన పడడం మమ్మల్ని బాధించిందన్నారు. వారంతా త్వరగా కోలుకొని ప్రజల ముందుకు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని నవీన్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు అనిల్ కూర్మాచలం, అశోక్ గౌడ్ దూసరి, సిక్కా చంద్రశేఖర్ గౌడ్, సతీష్ రెడ్డి, చిలుముల సత్యమూర్తి, పృథ్వీ రావుల స్థానిక కరోనా పరిస్థితులని బట్టి క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటారని నవీన్ రెడ్డి తెలిపారు.
దేశం లో కరోనా ఉదృతి ఎక్కువ ఉన్నందున ప్రజలంతా తప్పకుండా మాస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని, ప్రభుత్వానికి సహకరించి మిమ్మల్ని మీరు కాపాడుకొని ఇతరులకు కరోనా సోకకుండా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన