న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడుతుంటంతో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలను సమన్వయపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలను లోతుగా విశ్లేషించేందుకు మరో టాస్క్ ఫోర్స్ ను నియమించింది.
ఇక కేంద్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ సారథ్యంలో 13 మంది సభ్యులతో కొవిడ్ రిలీఫ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా అంబికా సోని, ముకుల్ వాస్నిక్, పవన్ బన్సల్, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, రణ్ దీప్ సుర్జీవాలా, మనీష్ చత్రా, డాక్టర్ అజయ్ కుమార్, పవన్ ఖేరా, గుర్దీప్ సింగ్, బీవీ శ్రీనివాస్ లను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణకు అశోక్ చవాన్ అధ్యక్షతన మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సల్మాన్ ఖుర్షీద్, మనీష్ తివారీ, విన్సెంట్ పలా, జోతిమణిలను సభ్యులుగా నియమించింది.