‘అమ్మాయిలందరూ ఎదవలకే పడతారంటారు. అందులో తాను నంబర్వన్ అంటోన్న ఓ యువకుడి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అని చెప్పారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాస్ నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. లావణ్యత్రిపాఠి కథానాయిక. శుక్రవారం ట్రైలర్ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ ట్రైలర్లో తనను పెళ్లిచేసుకోమంటూ లావణ్య త్రిపాఠి వెంటపడుతూ కార్తికేయ కనిపిస్తున్నారు. ‘నిన్ను నేను కాదు ప్రపంచంలో ఏ అమ్మాయి పెళ్లిచేసుకోదు. నంబర్వన్ ఎదవవి’ అంటూ లావణ్య త్రిపాఠి చెప్పిన డైలాగ్కు ‘అమ్మాయిలకు ఎట్టాగా ఎదవలే నచ్చుతారంటగా. మరి నేను నంబర్వన్ అయినప్పుడు నన్ను మించిన ఆప్షన్ ఏముంటుంది’ అంటూ కార్తికేయ సమాధానమివ్వడం ఆకట్టుకుంటుంది. సరదా సంభాషణలతో ఆద్యంతం వినోదభరితంగా ట్రైలర్ సాగింది. నిర్మాత మాట్లాడుతూ ‘బాలరాజు, మల్లిక అనే జంట ప్రణయప్రయాణానికి దృశ్యరూపమిది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. ఈ నెల 19న సినిమాను విడుదలచేస్తాం’ తెలిపారు. ఆమని, మురళీశర్మ, భద్రం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్, సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా.