అహ్మదాబాద్: కరోనా రోగులకు చికిత్సనందిస్తున్న వైద్యుల అంకితభావాన్ని ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు సంజీవ్కపూర్ ప్రశంసించారు. గుజరాత్లో రోగులకు సేవలందిస్తున్న 500 మందికిపైగా వైద్యులకు మూడు పూటలా ఉచితంగా ఆహారాన్ని సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. దీని కోసం ప్రత్యేకంగా డజను మంది వంటవాళ్లను నియమించినట్టు చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం నడుపుతున్న సివిల్ దవాఖాన వైద్యులకు ఈ భోజనాన్ని అందించనున్నట్టు వివరించారు. ఈ మీల్ సర్వీస్ ప్రారంభించడానికి కపూర్కు పలువురు ఆర్థిక సాయాన్ని అందించారు.