హైదరాబాద్ : నగరంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న శంకర్ నారాయణ సుబ్రమణ్యం(42), మెట్టు శ్రీకాంత్(33)ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరి నుంచి ఆరు వయల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే వీరు ఒక్కో వయల్ను రూ. 3,400లకు కొనుగోలు చేసి, దాన్ని రూ. 10 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు నిందితులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.