అహ్మదాబాద్ : కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. వైరస్తో బాధపడుతూ పెద్దసంఖ్యలో ప్రజలు ఆరోగ్య కేంద్రాలకు పోటెత్తడంతో పడకలు సరిపోని పరిస్ధితి నెలకొంది. గుజరాత్లోని ఓ దవాఖానలో రోగులు నేల పైనే పడుకుని బెడ్ కోసం వేచిచూస్తున్న పరిస్ధితి అందరినీ కలిచివేస్తోంది. గుజరాత్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ శక్తిసింగ్ గోహిల్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. భావ్నగర్లోని ప్రభుత్వ దవాఖానాలో కొందరు నేలపైనే పడుకుని ఉండగా, మరికొందరు స్ట్రెచర్పై పడుకుని దవాఖానాలో అడ్మిట్ అయ్యేందుకు పడిగాపులు కాస్తున్నట్టు 90 నిమిషాల నిడివితో కూడిన ఈ వీడియోలో కనిపించింది.
బెడ్ల కొరతతో కరోనా రోగులను దవాఖానాలో చేర్చుకోవడం లేదని గోహిల్ పేర్కొన్నారు. రోగులకు పడకలు సమకూర్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గుజరాత్ ప్రభుత్వం మాత్రం అంతా సజావుగా ఉందని చెప్పుకొస్తోందని విమర్శించారు. ఈ వీడియోను ఆయన సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్లకు ట్యాగ్ చేశారు. గుజరాత్లో అంతా బాగుందని చెబుతున్నా ఇక్కడ కేంద్ర వైద్య బృందాల అవసరం లేదా అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ను ప్రశ్నించారు. ఇక గుజరాత్లో గడిచిన 24 గంటల్లో 3575 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.