మండలి చైర్మన్ గుత్తా సంతాపం
పుణె, మే 16: కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాతవ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. కరోనా సోకి వెంటిలేటర్ సపోర్ట్తో చికిత్స తీసుకున్న ఆయన ఇటీవలే కోలుకున్నారు. అయితే సెకండరీ న్యుమోనియా, మల్టీ-ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ సమస్యతో ఆయన మరణించినట్టు పుణెలోని జహంగీర్ దవాఖాన వైద్యులు తెలిపారు. రాజీవ్ సాతవ్ మృతి పట్ల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సంతాపం తెలిపారు. సమస్యలపట్ల లోతైన అవగాహన ఉన్న అతికొద్ది మందిలో సాతవ్ ఒకరన్నారు.