గతేడాది కరోనాతో అన్నిపండగలకు దూరంగా ఉన్నారు దేశప్రజలు. చివరకు శ్రీరామనవమి కూడా చేసుకోలేకపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్ తో అన్నిరాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కోవిడ్ రోగులతో టాప్ లో ఉన్న మహారాష్ట్రలో గుళ్లు, బళ్లు, ఆఫీసులు అన్నీ మూతబడ్డాయి. దీంతో భక్తులు శ్రీరామ నవమి రోజున ఆలయం బయట నుంచే ఆ స్వామిని దర్శించుకొని వెనుదిరుగుతున్నారు.
మహారాష్ట్రలో ఆలయాల్లో నిత్యకైంకర్యాలు యథావిధిగా జరుగుతున్నా భక్తులను మాత్రం అనుమతించడం లేదు. దీంతో రామయ్య ఆలయాలు బోసి పోయాయి. కొంతమంది భక్తులు మాత్రం తాళాలు వేసి ఉన్న ఆలయాల్లోనే ఆ రామయ్యని స్మరించుకొని వెనుదిరుగుతున్నారు.