న్యూఢిల్లీ: పంజాబ్లో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్పై తిరుగుబాటు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూకు షాక్ తగిలింది. అక్కడి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కెప్టెన్నే వెనకేసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరీందర్ను సీఎంగా తొలగించకూడదని, ఇప్పటికీ అత్యంత జనాదరణ ఉన్న నేత ఆయనే అని వాళ్లు కాంగ్రెస్ హైకమాండ్కు చెప్పారు. 1984 తర్వాత కాంగ్రెస్లో ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం అమరీందరే అని అన్నారు. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవిని సిద్ధూకి ఇవ్వకూడదని వీళ్లు తేల్చి చెబుతున్నారు.
సమాజంలోని వివిధ వర్గాల్లో అమరీందర్కు మంచి ఆదరణ ఉన్నదని, ముఖ్యంగా వాటర్స్ అగ్రిమెంట్ యాక్ట్ను రద్దు చేయడంతో రైతులు ఆయన వెంటే ఉన్నారని ఆ ఎమ్మెల్యేలు తమ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉన్న ఈ సమయంలో పార్టీని మరొకరికి అప్పగించడం తీరని నష్టం చేకూరుస్తుందని వాళ్లు అభిప్రాయపడ్డారు. అమరీందర్పై ఆరోపణలు చేసిన సిద్ధూ పబ్లిగ్గా క్షమాపణ చెప్పాలన్న కెప్టెన్ డిమాండ్ను కూడా ఎమ్మెల్యేలు సమర్థించారు. సిద్ధూ సీనియర్ లీడర్ అయినా.. సొంత పార్టీపై పబ్లిగ్గా విమర్శలు చేయడం సరికాదని వాళ్లు అన్నారు.