ప్రత్యేక తరావి నమాజ్కు మసీదుల్లో ఏర్పాట్లు
ఉగాది పర్వదినం రోజు కనిపించిన నెలవంక
నెలరోజుల పాటు ముస్లింల ఉపవాస దీక్షలు
దండేపల్లి, ఏప్రిల్ 13 : రంజాన్ ఉపవాసాలు బుధవారం నుంచి ప్రారం భం కానున్నాయి. మంగళవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో అదే రాత్రి నుంచే ఖురాన్ పఠనం, తరావి నమాజ్ ప్రారంభిస్తారు. మరు సటి రోజు తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. ఉగాది పర్వదినం రోజే నెలవంక కనిపించడం విశేషం. ముస్లింలు ఉపవాసాలకు సిద్ధమవుతుండగా నమాజ్ల కోసం మసీదులు ముస్తాబు చేశారు. వేకువ జామున ఉపవాస దీక్ష ప్రారంభిం చడం కోసం సహర్కు.. సాయంత్రం దీక్ష (రోజా) విడిచే సమయానికి ఇఫ్తార్కు ప్రత్యేక వంటకాలను అం దించడం కోసం హోటళ్లు ఏర్పాటు చేశారు. ఈ మాసంలో హరీస్, హలీ మ్ వంటకాల కోసం ప్రత్యేకమైన దుకాణాలు వెలుస్తాయి. ఈవంటకా లను ముస్లింలే కాకుండా ఇతర వర్గాల వారు కూడా ఇష్టపడుతారు. రం జాన్ నెలలో ఇషా నమాజ్ అనంతరం నిర్వహించే తరావి ప్రత్యేక ప్రా ర్థనలకు జిల్లాలోని మసీదులలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెల తరువాత ఆకాశంలో షవ్వాల్ నెలవంక కనిపించిన మరుసటి రోజు ఈదుల్ ఫితర్ (రంజాన్)పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.