బెంగళూరు : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమవారం మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్నాండెజ్.. మంగళూరులోని యెనిపోయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇవాళ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఫెర్నాండెజ్ మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించారు.
ఈ ఏడాది జులైలో ఫెర్నాండెస్ తన ఇంట్లో యోగాసనాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి పరీక్షించి, మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఫెర్నాండెజ్కు సర్జరీ నిర్వహించి బ్లడ్ క్లాట్ను తొలగించారు. అప్పట్నుంచి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
యూపీఏ గవర్నమెంట్లో ఫెర్నాండెజ్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 1980లో కర్ణాటకలోని ఉడుపి నియోజకవర్గం నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1984, 1989, 1991, 1996లో లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 1998, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఫెర్నాండెజ్కు భార్య బ్లూజమ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫెర్నాండెజ్ 1941, మార్చి 27న ఉడుపిలో జన్మించారు.