న్యూఢిల్లీ : దేశ ప్రజలపై పెనుభారాలు మోపుతున్న బీజేపీ వారిపై ఆర్థిక దండయాత్రకు దిగిందని కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ ఆరోపించారు. కొవిడ్-19 బాధిత కుటుంబాలకు మోదీ ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదని, రైతులకు మద్దతు ధర కల్పించడం లేదని దుయ్యబట్టారు. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం లేదని, అయితే మోదీ ప్రజలకు లీటర్ పెట్రోల్ను రూ 100కు అందిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
కరోనా వైరస్తో మరణించిన వారందరికీ రూ 4 లక్షల పరిహారం చెల్లించలేమని, దీనికి వైపరీత్యాల నిధులు సరిపోవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించిన నేపథ్యంలో బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ నేత విమర్శలు గుప్పించారు. కాగా, కరోనా బాధిత కుటుంబాలకు కేంద్రం విధిగా పరిహారం చెల్లించాలని, పరిహార మొత్తం ఎంతనేది ప్రభుత్వం నిర్ణయించాలని సర్వన్నత న్యాయస్దానం స్పష్టం చేసింది.