ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి
మడికొండ, ఏప్రిల్ 26: తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తరాలపల్లి, రాంపేట గ్రామాల్లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కడిపికొండలోని ముదిరాజ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గొర్లు, మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బండా ప్రకాశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్ముతోందని, రైల్వేలో గౌతమి, కృష్ణ ఎక్స్ప్రెస్ ఉన్న పేర్లు భవిష్యత్లో అదానీ ఎక్స్ప్రెస్, అంబానీ ఎక్స్ప్రెస్లు అవుతాయన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే డివిజన్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ipl 2021: ఆ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్మన్ బెయిర్స్టో
సెలవుల్లో పరీక్షలు, క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు