హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసే హీరో నితిన్. తాజాగా ఈయన చేతి నిండా సినిమాలున్నాయి. అందులో మాస్ట్రో విడుదలకు సిద్ధంగా ఉంది కూడా. ఇప్పటికే 2021లో నెల రోజుల వ్యవధిలోనే చెక్, రంగ్ దే సినిమాలతో వచ్చాడు నితిన్. కరోనా సెకండ్ వేవ్ కు ముందుగానే ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. అయితే రెండూ పెద్దగా విజయం అందించలేదు ఈ హీరోకు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న మాస్ట్రో సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్స్ కాకుండా నేరుగా ఓటిటిలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం తర్వాత కూడా నితిన్ చేతిలో చాలా సినిమాలున్నాయి. అందులో ఒకటి వక్కంతం వంశీ ప్రాజెక్ట్.
నా పేరు సూర్య తర్వాత ఈయనతో సినిమా చేయడానికి నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఆలోచనలో పడిపోయారు. రైటర్ గా బ్లాక్ బస్టర్స్ అందుకున్న వంశీ.. దర్శకుడిగా మాత్రం తొలి అడుగుతోనే ఫ్లాప్ ఇచ్చాడు. నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయినా కూడా కొందరికి వక్కంతం వంశీ సిన్సియర్ అటెంప్ట్ నచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత కొందరు హీరోలకు కథలు చెప్పినా ఎవరూ నమ్మలేదు. రవితేజ ఈయనతో సినిమా అనౌన్స్ చేసి కూడా కామ్ అయిపోయాడు. మధ్యలో మరికొందరు హీరోల పేర్లు కూడా వినిపించాయి కానీ కుదర్లేదు. అయితే చివరికి నితిన్ ను తన కథతో ఒప్పించాడు వంశీ. ఇదిలా ఉంటే ఒక్క విషయంలో మాత్రం నితిన్ అస్సలు తగ్గేదే లే అంటున్నాడు.
అదే హీరోయిన్స్ విషయంలో.. ఈయన సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ నటిస్తుంటారు. గత కొన్నేళ్లుగా కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్ సహా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అందరితోనూ రొమాన్స్ చేసాడు నితిన్. ఇప్పుడు మరో టాప్ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. వక్కంతం వంశీ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ లేకపోయినా కూడా దాదాపు ఈమె పేరు ఖరారైపోయినట్లే కనిపిస్తుంది. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన పూజాను ఒప్పించాలంటే 2 కోట్లకు పైగా సమర్పించుకోవాల్సిందే. అయినా కూడా నితిన్ వెనక్కి తగ్గేదే లేదంటున్నాడు. ఏదేమైనా హీరోయిన్స్ విషయంలో మాత్రం నితిన్ దూసుకుపోతున్నాడు