తిరువనంతపురం : లవ్ జిహాద్ తర్వాత క్రైస్తవ యువతీయువకులు టార్గెట్గా డ్రగ్ జిహాద్ ప్రబలుతోందని కల్లరన్గట్ చర్చి బిషప్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలను కేరళ కాంగ్రెస్ కమిటీ తోసిపుచ్చింది. జోసెఫ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పీటీ థామస్ అన్నారు. మేధావి, విద్యావేత్త అయిన బిషప్ జోసెఫ్ ఏ ఆధారంతో ఇలా మాట్లాడారో తమకు అర్ధం కావడం లేదని కాంగ్రెస్ నేత ఆందోళన వ్యక్తం చేశారు.
బిషప్ వ్యాఖ్యలు గర్హనీయమని అవి మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని థామస్ పేర్కొన్నారు. కాగా కేరళలో డ్రగ్ జిహాద్ విస్తరిస్తోందని, రాష్ట్రంలో పెరుగుతున్న నార్కోటిక్స్ సరఫరానే ఇందుకు నిదర్శనమని క్రైస్తవ యువతను మత్తుమందులో ముంచి మత మార్పిడులకు పాల్పడుతున్నారని బిషప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.