న్యూఢిల్లీ : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవి పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సుస్మితా దేవ్ స్ధానంలో మహిళా కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్గా నెటా డిసౌజాను నియమించింది.
పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డిసౌజాను మహిళా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించారని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. మహిళా కాంగ్రెస్కు ఫుల్టైం అధ్యక్షురాలి నిమాయకం జరిగే వరకూ నెటా డిసౌజా ఆ పదవిలో కొనసాగుతారని తెలిపింది.