ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్ అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఠక్కున గుర్తొస్తారు. ఈ హీరోలకు అశేష ప్రేక్షకాదరణ ఉంది. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న ఈ స్టార్ హీరోలని కలిసి కట్టుగా చూస్తే కనుల పండుగగా ఉంటుంది. అయితే ఇది సాధ్యం కావాలంటే కొంత నిరీక్షణ తప్పదు. కాని పెన్సిల్ ఆర్ట్తో సుసాధ్యం చేశాడు. అందరు హీరోలని ఒకే చోట చేర్చి అభిమానులకి ఆనందాన్ని కలిగించాడు హర్ష.
హర్ష వేసిన పెన్సిల్ ఆర్ట్లో స్టార్ హీరోలందరు ముచ్చటించుకుంటూ, కాఫీ తాగుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ఆర్ట్ ఎలా ఉన్నా కూడా కాన్సెప్ట్ మాత్రం కేక పుట్టిస్తుందని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ స్టార్ హీరోలు అందరు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..