ముంబై : మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలో గత బీజేపీ సర్కార్ హయాంలో పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారా అని కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో పెగాసస్ స్కామ్ జరిగిందా అని మహా వికాస్ అఘడి సర్కార్లో భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ నిలదీసింది. ఈ ఘటనపై సంకీర్ణ సర్కార్ దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.
కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన కదలికలపై నిఘా పెట్టారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె ఇటీవల చేసిన ఆరోపణలు కలకలం రేపగా కాంగ్రెస్ నేత మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ సర్కార్ హాంలో సీనియర్ ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా ప్రమేయంతో అనధికార ఫోన్ ట్యాపింగ్ ఘట జరిగిందని సావంత్ ఆరోపిస్తున్నారు. పెగాసస్ స్పైవేర్ను వాడారని కూడా ప్రచారం జరిగిందని అన్నారు.