న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంకే స్టాలిన్కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. కరుణానిధి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 234 స్థానాలకుగాను 160 స్థానాల్లో డీఎంకే జయకేతనం ఎగురవేసింది. దాంతో స్టాలిన్ తొలిసారి తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు.
ఈ ఉదయం చెన్నైలోని రాజ్భవన్లో స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్టాలిన్తో మరో 34 మంది డీఎంకే ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణం చేశారు.