కొత్తూరు రూరల్, మే 11 : నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ను విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్ మంగళవారం ప్రకటించటంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. దీంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనేందుకు ప్రజలు ముందు జాగ్రత్తను వహించారు. మద్యంప్రియులు అయితే దుకాణాల వద్ద క్యూ కట్టి మరీ కొనుగోలు చేశారు. వైన్స్ షాప్ల వద్ద రద్దీ పెరుగడంతో షాద్నగర్ ఎక్సైజ్ సీఐ రామకృష్ణ కొత్తూరు మండల కేంద్రంలో, తిమ్మాపూర్లో, పారిశ్రామికవాడలోని వైన్స్ షాప్ల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలను తీసుకున్నారు. వినియోదారుడికి అర్థం అయ్యేలా వైన్స్ షాప్ తెరిచి ఉంచే సమయాలు గోడపై రాయించాలన్నారు. మాస్కు ధరించిన వారికి మాత్రమే మద్యం అమ్మాలని నిర్వాహకులకు సీఐ తెలిపారు.
యాచారంలో..
యాచారం, మే 11 : నేటి నుంచి లాక్డౌన్ విధించడంతో మండలంలోని మాల్, యాచారం, గున్గల్ వైన్స్ల వద్ద ప్రజలు బారులు తీరారు. జనం ఒక్కసారిగా గుమిగూడడంతో సీఐ లింగయ్య, ఎస్ఐ ప్రభాకర్ సిబ్బందితో క్రమ పద్ధతిలో మందుబాటిళ్లను తీసుకునేలా చేశారు. వైన్స్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అదుపు చేశారు.
మొయినాబాద్లో…
మొయినాబాద్, మే 11 : రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించాలని కేబినేట్లో నిర్ణయం తీసుకోవడంతో మద్య దుకాణాల ఎదుట బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంటాయని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారని బ్రేకింగ్ న్యూస్ వస్తుండగానే మందుబాబులు దుకాణాల వద్ద బారులు తీరారు. మద్యం వ్యాపారులు అప్పటికప్పుడు మద్యం కొరత చూపించారు. దుకాణంలో ఉన్న మద్యాన్ని అక్రమంగా నిలువ చేసుకున్నారు. మందుప్రియులు కూడా నేటి నుంచి మద్యం దొరుకుతుందో లేదో అని మద్యంను ఇండ్లలో నిలువ చేసుకున్నారు.
కేశంపేటలో..
కేశంపేట, మే 11 : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి లాక్డౌన్ ప్రకటించడంతో మండల కేంద్రంలో మందుబాబులు వైన్షాపుల ఎదుట బారులు తీరారు. వైన్షాపుల యజమానులు పోలీసుల సహాకారంతో ప్రజలకు మద్యాన్ని విక్రయించారు. కొందరు ఎక్కువ మొత్తంలో మద్యం బాటిళ్లను కొనుగోలు చేశారు.