సుల్తాన్బజార్, జూన్ 7 : భాగ్యనగర్ తెలంగాణ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ సభ్యుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం బీటీఎన్జీవో హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడు, టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ జన్మదినం సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, టీజీవో అధ్యక్షురాలు వి.మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు తదితరులు ఉన్నారు.