తిరువనంతపురం: కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 17, 18 (శని, ఆదివారాలు) తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఉన్న కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల్లో సడలింపులు ఇచ్చింది. కేరళలో ప్రస్తుతం 196 స్థాని సంస్థలు ఉన్నాయి. కేసుల నమోదునుబట్టి వీటిని మూడు భాగాలుగా విభజించింది. వాటి ఆధారంగా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు గురువారం తెల్లవారుజామున 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
రాష్ట్రంలో నిన్న కొత్తగా 14,539 కేసులు నమోదయ్యాయి. 124 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 30,87,673కు, మరణాలు 14,810కి చేరాయి.