లక్నో : కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో కేసుల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తర్ ప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి ఈనెల 30 సాయంత్రం నుంచి మే 4 ఉదయం వరకూ సంపూర్ణ లాక్డౌన్ అమలవుతుందని యూపీ ప్రభుత్వం గురువారం వెల్లడించింది.
కేసుల పెరుగుదలతో పలు రాష్ట్రాలు వారాంతాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ వంటి పలు నియంత్రణలను అమలు చేస్తున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయడంతో పాటు ఆక్సిజన్ బెడ్లు, మందుల కొరతను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నాయి.