న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఇక రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్డౌన్ల బాటపడుతున్నాయి. ఇప్పటికే ఒడిశాలో రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉదయం ప్రకటించింది. తాజాగా మరో రాష్ట్రం ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది. హర్యానాలో మే 3 నుంచి ఏడు రోజులపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నామని రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు.
హర్యానాలో కొత్తగా 13,588 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,01,566కు చేరాయి. ఇందులో 1,02,516 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,94,709 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4341 మంది వైరస్వల్ల మృతిచెందారు.
కరోనా రెండో విజృంభణ వల్ల తీవ్ర ప్రభావానికి గురవుతున్న ఒడిశాలో ఈనెల 5 నుంచి 19 వరకు 14 రోజులపాటు లాక్ డౌన్ విధించనున్నారు. వచ్చే బుధవారం నుంచి రెండు వారాలపాటు లాక్ డౌన్ అమలు అవుతుందని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అత్యవసర సేవలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..