బెంగళూర్ : కరోనా కట్టడికి రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఈనెల 21 వరకూ లాక్డౌన్ పొడిగించాలని కర్నాటక ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. చిక్మగళూర్, శివమొగ్గ, దావణగెరె, మైసూర్, చామరాజనగర్, హసన్, దక్షిణ కన్నడ, బెంగళూర్ రూరల్, మాండ్య, బెల్గావి, కొడగు జిల్లాల్లో ఈనెల 21 వరకూ పూర్తి లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఆరోగ్య మంత్రి కే సుధాకర్ వెల్లడించారు.
కరోనా పాజిటివిటీ రేటు 15 శాతం పైగా ఉన్న జిల్లాల్లో లాక్డౌన్ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. బెంగళూర్ నగరంతో పాటు మిగిలిన జిల్లాల్లో లాక్డౌన్ మార్గదర్శకాలను సడలించామని తెలిపారు. అన్ని జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.