ప్రతీ ప్రయాణికుడి సమయం విలువైందే
సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: రైలు ఆలస్యమైతే రైల్వే శాఖ ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రతీ ప్రయాణికుడి సమయం విలువైనదేనని జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమ నియంత్రణలో లేని కారణాల వల్ల ఆలస్యమైతేనే పరిహారం నుంచి రైల్వేకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) ఇచ్చిన తీర్పును సమర్థించింది. 2016లో జమ్ముతావి రైల్వే స్టేషన్కు ఉదయం 8 గంటలకు రావాల్సిన రైలు నాలుగు గంటలు లేట్గా వచ్చింది. దీంతో నలుగురు వ్యక్తులు శ్రీనగర్లో ఎక్కాల్సిన రైలును మిస్ అయ్యారు. దీనిపై ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు. ఒక్కొక్కరికి రూ.30వేల చొప్పున పరిహారం చెల్లించాలని కమిషన్ వాయువ్య రైల్వేను ఆదేశించింది.