హైదరాబాద్: లడాఖ్ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిపై ఇవాళ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా మాట్లాడారు. భారత, చైనా దళాల మధ్య మరోసారి చర్చలు జరగనున్నట్లు ఆయన చెప్పారు. కమాండర్ స్థాయిలో చర్చలు ఉంటాయని, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. చైనా సైనికాధికారులతో చర్చ కొనసాగిస్తూనే ఉంటామని, ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి దళాలు ఉపసంహరించే ప్రయత్నం చేస్తామని, దాంతో ఉద్రిక్తతలు తగ్గించే ఏర్పాట్లు చేస్తామని భదౌరియా వెల్లడించారు. హైదరాబాద్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్లో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు. మా వైపు నుంచి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. గత ఏడాది కాలంలో భారత శక్తి సామర్ధ్యాలు పెరిగినట్లు ఆయన చెప్పారు.