న్యూఢిల్లీ: భారత రక్షణ దళాల చరిత్రలో కొత్త అధ్యాయం నమోదైంది. 26 సంవత్సరాల పాటు సేవలు అందించిన ఐదుగురు మహిళా సైనికాధికారులకు కర్నల్ ర్యాంకు ఇవ్వడానికి ఆర్మీ సెలెక్షన్ బోర్డు పచ్చజెండా ఊపింది. సైన్యంలోని న్యాయ, వైద్య, విద్యా విభాగంలో సేవలందించిన మహిళా అధికారులకు సీనియర్ ర్యాంకులు ఇచ్చే ఆనవాయితీ ఉన్నప్పటికీ సిగ్నల్స్, ఇంజినీరింగ్ విభాగాలలో మహిళలకు కర్నల్ ర్యాంకు ఇవ్వడం ఇదే మొదటిసారి అవుతుంది. సంగీత సర్దానా, సోనియా ఆనంద, నవనీత్ దుగ్గల్, రీనూ ఖన్నా, రిచా సాగర్.. ఈ ఐదుగురు మహిళా లెఫ్టినెంట్ కర్నల్స్కు కర్నల్స్గా ప్రమోషన్ లభించింది.