పాట్నా : బీహార్లో మళ్లీ కాలేజీలు తెరుచుకున్నాయి. ఇవాళ్టి నుంచి ఆ రాష్ట్రంలో 11, 12వ తరగతులకు కాలేజీలు ప్రారంభం అయ్యాయి. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కాలేజీకి రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిత్రులను కలుసుకుని ఆనందంలో తేలిపోయారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో మళ్లీ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కూడా స్పందించారు. కరోనా థార్డ్ వేవ్ వస్తుందన్న జాగ్రత్తలో తాము ఉన్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం కూడా చాలా జాగ్రత్తగా అన్నింటినీ పరిశీలిస్తోందన్నారు. ఆక్సిజన్తో పాటు అన్నీ అందుబాటులో ఉంచామన్నారు. హాస్పిటళ్లు, అధికారులు సంసిద్ధంగా ఉన్నారన్నారు. అందరూ జాగ్రత్తగా ఉన్నారని, పరిస్థితిని నిరంతరం మానిటర్ చేస్తున్న సీఎం నితీశ్ వెల్లడించారు.